Sambashana

Telugu News

Xerox Registrations: ఏపీలో జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం.. నేటి నుంచే షురూ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో ఈ విధానాన్ని ప్రారంభించినా.. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ వేగం మందగించగా.. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయని రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు.

విశాఖపట్నంలోని 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గతంలో రోజుకు 200 రిజిస్ట్రేషన్లు జరిగేవని, అయితే గత వారం ప్రారంభించిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానంలో మొత్తం 9 కార్యాలయాల్లో రోజుకు 20 కూడా లేదన్నారు. అలాగే విజయవాడలోని మూడు కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు వేళ్లపై లెక్కించవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విధానం దాదాపు నెలన్నర కావస్తున్నా పెద్దగా మార్పులు కనిపించడం లేదన్నది వారి ఫిర్యాదు. దీని వల్ల వచ్చే సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.