Sambashana

Telugu News

Pawan Kalyan: కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్ వారాహి యాత్ర..

1 min read

Pawan Kalyan: కృష్ణా జిల్లాలో ఇవాల్టి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర కొనసాగనుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. వారాహి వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. కృష్ణా జిల్లాలో దాదాపు ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డలో బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని అక్టోబర్ 2, 3 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.రేపు (అక్టోబర్ 2) కృష్ణా జిల్లా జనసేన నేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. ఎల్లుండి (అక్టోబర్ 3) జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు.

అక్టోబర్ 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.అయితే పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేతివృత్తులపై ఆధారపడిన వారికి భరోసా కల్పిస్తామన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో వారాహి యాత్రలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత యాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతారని జనసేన నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు పలకనున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి టీడీపీ క్యాడర్ పనిచేస్తున్నప్పటికీ.. ఆ రెండు పార్టీలు తొలిసారి అధికారికంగా వారాహి యాత్రలో పాల్గొనబోతున్నాయి.