Sambashana

Telugu News

Prashanth neel: అల్లు అర్జున్ ను మోసం చేసిన ప్రశాంత్ నీల్.. పాపం పండుద్ది అంటున్న నెటిజన్స్

1 min read

Prashanth neel: ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతున్న పేరు. చేసింది రెండు సినిమాలే అయినా పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తనతో సినిమాలు చేసేందుకు సౌత్ టు నార్త్ హీరోలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోలకున్నంత రేంజ్ పాపులారిటీ ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో తన మార్క్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి రుచి చూపించాడు. తాజాగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి సలార్ సినిమాను మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ హీరోతో చేయాలని అనుకున్నాడట.

ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీతోనే సలార్ సినిమాను తెరకెక్కించాలని ఆశపడ్డాడట ప్రశాంత్ నీల్. అల్లు అర్జున్‎కి కూడా కథ నచ్చిందట. కానీ టైం అడ్జస్ట్ చేయలేక కొన్ని నెలలు వెయిట్ చేయమంటూ కోరారట. అంతవరకు ఆగలేని ప్రశాంత్ నీల్ ఆ కథను ప్రభాస్ దగ్గరకి తీసుకెళ్లి చెప్పగా తనకు కథ నచ్చి ఓకే చెప్పి ప్రాజెక్ట్ పట్టాలెక్కించారట. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

అయితే బన్నీ ఎంతో ఇష్టపడిన సలార్ సినిమాను ఇలా వేరే హీరోకి ఇచ్చేయడం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో అలా మా హీరోను మోసం చేశావు.. ఆ పాపం నీకు ఊరికే పోదంటూ ఘాటుగా పరోక్షంగా శాపనార్దాలు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ కథను బన్నీ కోసం ప్రశాంత్ నీల్ రాసుకున్నాడు అన్న విషయం ప్రభాస్ కి తెలియనే తెలియదట. దీంతో ప్రభాస్ సైతం ఈ న్యూస్ విని షాక్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.