Sambashana

Telugu News

OYO: ఓయోలో జంట మృత దేహాలు.. అసలు జరిగింది ఇదే?

1 min read

OYO: ఓయో హోటల్‌లో రెండు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఓ యువకుడు మహిళను హోటల్‌కు పిలిచి హత్య చేసి తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓయో హోటల్ నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి మరణ రహస్యం వెల్లడైంది. 27 ఏళ్ల యువతిని హత్య చేసి 28 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో హత్య సెక్షన్‌ను కూడా చేర్చారు.

ప్రాథమిక విచారణలో వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావించారు. అయితే యువతి గొంతు నులిమి హత్య చేసి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారని ఈశాన్య డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపారు. అక్టోబరు 28వ తేదీ రాత్రి హోటల్ గదిలో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందని తెలిపారు. ఇందులో మంచంపై మహిళ మృతదేహం ఉండగా, యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఈ జంట ఓయో హోటల్ గదిని కేవలం నాలుగు గంటలకే బుక్ చేసుకోవడం గమనార్హం.

ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపు తట్టారు. లోపలి నుంచి స్పందన రాకపోవడంతో పోలీసులను పిలిచి తలుపులు తీశారు. ఆత్మహత్యకు ముందు యువకుడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, తమ జీవితాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని రాసింది. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త వృత్తిరీత్యా వ్యాపారవేత్త. యువకుడి సంబంధం ఖరారైందని, పెళ్లి చేసుకోబోతున్నాడని.. అయితే పెళ్లి చేసుకోవద్దని మహిళ ఒత్తిడి చేయడంతో మహిళను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు.