Sambashana

Telugu News

Chirmarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమికోసం పనిచేస్తా..చిరుమర్తి లింగయ్య సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి సోదరులపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నగిరేకల్ మండలం పాలెం, నోముల గ్రామాల్లో చిరుమూర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను భౌతికంగా నాశనం చేసేందుకు కోమటిరెడ్డి సోదరులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డబ్బులకు అమ్ముడుపోయి పార్టీలో చేరారని కోమటిరెడ్డి సోదరుల ఆరోపణలను నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిరుమూర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర నాకు లేదని చెరుమూర్తి లింగయ్య ఘాటుగా స్పందిస్తూ… ఏడాదిలోపే రెండు పార్టీలు ఎందుకు మారారో, ఏ ఉద్దేశంతో వచ్చారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. మానుకోకపోతే నకిరేకల్‌ను వదిలి మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి, నల్గొండలో వెంకట్‌రెడ్డి ఓటమికి కృషి చేస్తానని చిరుమూర్తి లింగయ్య శపథం చేశారు.

2014 ఎన్నికల్లో తన ఓటమికి కోమటిరెడ్డి సోదరులే కారణమని లింగయ్య ఆరోపించారు. అంతేకాదు.. తనకు మంత్రి పదవి రాకుండా చేసింది వాళ్లేనని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని కోమటిరెడ్డి సోదరులపై చిరుమూర్తి లింగయ్య మండిపడ్డారు. తాను దళితుడిని కాబట్టి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చిరుమూర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత 2014లో పోటీ చేసినా ఓడిపోయారు. 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోయారు.

కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. అందుకే తనకు అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాకుండా చిరుమూర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు కోమటిరెడ్డి సోదరుల బాటలోనే నడిచిన చిరుమూర్తి ఒక్కసారిగా ధైర్యం చేసి విడిపోయారు. నాటి నుంచి నేటి వరకు అదే దూరం పాటిస్తున్నారు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నకిరేకల్ నియోజకవర్గం పరిస్థితి కూడా మారిపోయింది. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్, వేముల వీరేశం ఒక్కటయ్యారు. కోమటిరెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గంలో వేముల ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ నేతలంతా మారుతున్నారు. దాంతో నియోజ క వ ర్గంలో ప రిస్థితి శ ర వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చిరుమూర్తి లింగయ్య సెంటిమెంట్ డైలాగులు వదులుతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.