Sambashana

Telugu News

Nagarjuna: సెంచరీ సినిమాకి కెప్టెన్ ఎవరు కింగ్?

వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో ఇటీవలే అనౌన్స్ అయిన ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్ కీరవాణితో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ అవ్వగానే వందో సినిమా సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కింగ్ నాగ్. అయితే అసలు ఆ బెంచ్ మార్క్ సినిమాకి దర్శకుడిని నాగార్జున ఫైనల్ చేశాడా లేదా అనేది అక్కినేని అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది. మెగాస్టార్ చిరు ‘త్రినేత్రుడు’ సినిమాతో, బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సినిమాలతో సెంచరీ బెంచ్ మార్క్ ని రీచ్ అయ్యారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే నాగార్జున బెంచ్ మార్క్ మూవీని ‘మోహన్ రాజా’ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా చేతిలో తన వందో సినిమా బాధ్యతని పెట్టడానికి నాగ్ ప్రిపేర్ అవుతున్నాడట. గాడ్ ఫాదర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా చిరు లాంటి స్టార్ హీరోని మోహన్ రాజా చూపించిన విధానం నచ్చి నాగార్జున అతనికి ఈ అవకాశం ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కువగా రీమేక్ సినిమాలే చేసి హిట్స్ కొట్టిన మోహన్ రాజా, సొంతకథతో ‘తనీ ఒరువన్’ లాంటి కమర్షియల్ హిట్ కొట్టాడు పైగా మోహన్ రాజా ఇప్పుడు తనీ ఒరువన్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది కంప్లీట్ అయ్యాకా మోహన్ రాజా నాగార్జున కలిసి సినిమా చేస్తున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. అప్పటివరకూ నాగార్జున తన సెంచరీ సినిమా బాధ్యత ఎవరి చేతిలో పెట్టనట్లే.