Sambashana

Telugu News

Ranveer Singh: ముంబైలో ఖరీదైన అపార్టుమెంట్లను అమ్మేసిన రణవీర్ సింగ్

1 min read

Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్‌లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం, రణవీర్ సింగ్ ఈ రెండు ఫ్లాట్‌లను డిసెంబర్ 2014లో ఒక్కో ఫ్లాట్‌కు రూ.4.64 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఈ రెండు ఫ్లాట్‌లు ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న ఒబెరాయ్ రియాల్టీ ప్రాజెక్ట్ అయిన ఒబెరాయ్ ఎక్స్‌క్లూజివ్‌లో భాగం. ఒక్కో ఫ్లాట్‌కు రూ.45.75 లక్షల ఫ్లాట్ స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్లాట్ల విస్తీర్ణం మొత్తం 1,324 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు ప్రతి ఫ్లాట్‌లో మొత్తం 6 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఫ్లాట్‌ను అదే గృహ సముదాయానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు.

రణవీర్ సింగ్ 2022 సంవత్సరంలో అతను ముంబైలోని బాంద్రా ప్రాంతంలో క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్ కొన్నాడు. మీడియా కథనాల ప్రకారం ఈ ఫ్లాట్ ధర దాదాపు రూ.119 కోట్లు. ఈ ఫ్లాట్‌లను రణవీర్ సింగ్ తండ్రి జగ్జిత్ సుందర్ సింగ్ భవ్నానీ. ఆయన కంపెనీ ఓ ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి కొనుగోలు చేశారు. ఇద్దరూ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఆస్తికి సంబంధించి రూ.118.94 కోట్లకు డీల్ జరగ్గా, దానికి స్టాంప్ డ్యూటీ కింద రూ.7.13 కోట్లు చెల్లించారు.

రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇటీవల అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ కూడా పెద్ద ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. సోనమ్ కపూర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని 5,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 32 కోట్లకు విక్రయించాల్సి ఉంది. కాగా అక్షయ్ కుమార్ 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్‌ను రూ.6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2022 సంవత్సరంలో జరిగింది.