BSF Drugs Operation: పంజాబ్లో అనుమానాస్పద డ్రోన్.. 2.5 కిలోల హెరాయిన్ స్వాధీనం
1 min readBSF Drugs Operation: పంజాబ్లోని తర్న్ తరణ్ జిల్లాలోని టిజె సింగ్ గ్రామ సమీపంలో అనుమానాస్పద డ్రోన్ ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. పంజాబ్ పోలీసులతో కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో తర్న్ తరణ్ జిల్లాలోని రాజోకే గ్రామంలోని వరి పొలం నుండి క్వాడ్కాప్టర్ డ్రోన్ స్వాధీనం చేసుకుంది. బీఎస్ఎఫ్ సైనికులు డ్రోన్ను సోదా చేయగా అందులో 2.5 కిలోల హెరాయిన్ బయటపడింది. దీంతో ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్లోని తర్న్ తరణ్ జిల్లా పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉంది. డ్రగ్స్తో కూడిన డ్రోన్ పట్టుబడిన గ్రామం కూడా సరిహద్దుకు చాలా దూరంలో లేదు. పాకిస్తాన్ నుండి డ్రగ్స్ స్మగ్లర్లు డ్రగ్స్ సరుకులను భారతదేశానికి డెలివరీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. బీఎస్ ఎఫ్ అప్రమత్తత కారణంగా ఈ డ్రోన్లను తరచుగా కూల్చి వేస్తున్నారు. ఈ మొత్తం ప్రాంతంపై బీఎస్ ఎఫ్ నిఘా ఉంచింది.
Read Also:Nipha Virus: నిపా వైరస్ గురించి హెచ్చరించిన శాస్త్రవేత్త.. సోకిన 10లో 9మంది చావడం గ్యారంటీ
అంతకుముందు సెప్టెంబర్ 1న కూడా తర్న్ తరణ్ జిల్లాలో బీఎస్ఎఫ్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ నుంచి భారత సరిహద్దుల్లోకి డ్రగ్స్ పంపుతున్నట్లు సమాచారం అందిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. దీని తర్వాత బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లాలోని మెహందీపూర్ గ్రామంలో మూడు డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తెరవగా అందులో 2.7 కిలోల హెరాయిన్ లభించింది. పాక్ డ్రోన్ల ద్వారా డ్రగ్స్ను భారత సరిహద్దుకు పంపించారు.
పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్లో లఖానా గ్రామంలో కూడా ఆగస్టులో ఇలాంటిదే కనిపించింది. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి పంజాబ్కు డ్రగ్స్ను పంపుతున్నట్లు బీఎస్ఎఫ్కు సమాచారం అందింది. దీని తరువాత, అమృత్స, ఫిరోజ్పూర్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో సైనికులు దెబ్బతిన్న డ్రోన్ను కనుగొన్నారు.
Read Also:Revanth Reddy: సోనియాగాంధీని ఈడీ ఆఫీస్ కి పిలిచి విచారణ చేయలేదా?
1 thought on “BSF Drugs Operation: పంజాబ్లో అనుమానాస్పద డ్రోన్.. 2.5 కిలోల హెరాయిన్ స్వాధీనం”
Comments are closed.